Friday, May 17, 2024

విరూపాక్ష టీమ్‌ నుంచి మిథికల్‌ థ్రిల్లర్ మూవీ

సాయిధరమ్‌ తేజ్‌, సంయుక్తమీనన్‌ జంటగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ సంస్థ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సంయుక్త నిర్మాణంలో బి.బాపినీడు సమర్పణలో అగ్రనిర్మాత బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన మిస్టీక్‌ థ్రిల్లర్‌ విరూపాక్ష చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రం. హారర్‌ ధ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతి నిచ్చింది ఈ చిత్రం. విరూపాక్షను మిస్టీక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన దర్శకుడు కార్తీక్‌ దండు తాజాగా తన తదుపరి చిత్రాన్ని మిథికల్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందించనున్నారు

ఈ చిత్రాన్నికూడా విరూపాక్ష చిత్రాన్ని నిర్మించిన బ్లాక్‌బస్టర్‌ నిర్మాత బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. బాపినీడు.బి.సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ సంస్థ, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన ప్రీలుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్‌ పనులను ప్రారంభించినట్లు- చిత్ర బృందం తెలిపింది

Advertisement

తాజా వార్తలు

Advertisement