Friday, April 26, 2024

వ్యాక్సిన్ వేసుకుని కరోనాను తరిమేద్దామంటున్న హీరోయిన్

కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడానికి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా వ్యాక్సిన్ ను వేసుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. తను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నానని చెబుతూ సోషల్ మీడియాలో కొన్ని విషయాలను షేర్ చేశారు. ఉదాహరణకు బైక్ మీద వెళ్లే వారు ప్రమాదాన్ని ఊహించలేరు. కానీ వారు హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. తీసుకున్నంత మాత్రాన కరోనా రాదు అని కాదు. కానీ తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ప్రాణాలకు హాని ఉండదు అని చెప్పుకొచ్చారు వరలక్ష్మి శరత్ కుమార్.

అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడకండి. అందరికీ ఆ పరిస్థితి రాదు. ఒకవేళ వచ్చినా అది మాములే. ఇంకో విషయం ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎవరు ఇప్పటివరకు చనిపోలేదు. వేరే కారణాల వల్ల చనిపోయారు. ఒక వేళ ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే సంబంధిత వైద్యుల సలహా తీసుకుని వేయించుకోవాలి. అందరం వ్యాక్సిన్ వేయించుకుని కరోనాను తరిమేద్దాం అని అన్నారు వరలక్ష్మి శరత్ కుమార్.

https://youtu.be/XXYgVV0yAwc
Advertisement

తాజా వార్తలు

Advertisement