Thursday, April 25, 2024

వరలక్ష్మీ శరత్ కుమార్ @#NBK107 ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేసింది. ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే గోపీచంద్ మలినేని గత చిత్రం క్రాక్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను సాధించింది.

కాగా ఈ సినిమాలో జయమ్మ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నిఅద్భుతంగా నటించారు. జయమ్మ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ సినిమాలో కూడా వరలక్ష్మి శరత్ కుమార్ కు ఓ పాత్ర రాసారట గోపీచంద్. ఓ పవర్ ఫుల్ లేడీ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించనుందట. అలాగే క్రాక్ సినిమాలో నటించిన వేటపాలెం బ్యాచ్ ని కూడా గోపీచంద్ రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement