Friday, April 26, 2024

మహేష్ కోసం రేస్ లో ముగ్గురు దర్శకులు ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాకి ఓకే చెప్పాడు. అయితే రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. అయితే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అయ్యాక కొంత గ్యాప్ తీసుకుని మహేష్ తో సినిమా చేయబోతున్నాడట. ఈ గ్యాప్ లో మరో సినిమాని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట మహేష్. అయితే సినిమా ఎవరితో ఉండబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, అనిల్ రావి పూడి,వంశీ పైడిపల్లి పేర్లు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తో గతంలో మహేష్ అతడు,ఖలేజా సినిమాలు చేశాడు. అనిల్ రావిపూడి తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాడు. అలాగే వంశీ తో మహర్షి సినిమా చేశాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరితో మహేష్ సినిమా చేశారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement