Wednesday, May 1, 2024

17ఏళ్ల త‌ర్వాత మెగాస్టార్ తో త్రిష‌..!

మెగాస్టార్ చిరంజీవి ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ సినిమాకి ఓకే చెప్పాడ‌ట‌.ఈ సినిమాను చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ను ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. హీరోయిన్ గా త్రిష ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలకు పైగా పైగానే పూర్తి అయినా కూడా తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ లో ఈమె నటించి మరోసారి తన సత్తా చాటింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ కలిగి ఉన్న త్రిష కు టాలీవుడ్ నుండి వరుసగా ఆఫర్లు వస్తున్నాయట.తమిళ్ లో కంటిన్యూ గా సినిమాలు చేస్తూనే ఉన్న ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు చిరంజీవికి జోడీగా నటించే అవకాశం రావడంతో మళ్లీ టాలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తో స్టాలిన్ సినిమాలో 17 ఏళ్ల క్రితం నటించిన త్రిష ఇప్పుడు మరోసారి ఆయనతో నటించేందుకు రెడీ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement