Thursday, May 2, 2024

ముంబై టు హైదరాబాద్ @రష్మీక మందన్న

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది రష్మిక మందన్న. ఆ తర్వాత వరుస సూపర్ డూపర్ హిట్ లను అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. మరోవైపు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది రష్మిక.

ప్రస్తుతం సిద్ధార్థ మల్హోత్రా తో మిషన్ మజ్ను అనే సినిమా చేస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ నిమిత్తం ఆదివారం ముంబై వెళ్ళిన ఈ అమ్మడు అక్కడ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. వెంటనే ఈరోజు ఉదయం హైదరాబాద్ లో శర్వానంద్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగులో పాల్గొంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement