Sunday, May 5, 2024

కన్నడ నాట మళ్ళీ డ్రగ్స్ రచ్చ…ఆ ఇద్దరు!!

కన్నడ డ్రగ్స్ కేస్ లో హీరోయిన్ లకు ఉచ్చు బిగుస్తోంది . ఈ కేసులో ఇరుకున్న కన్నడ హీరోయిన్లు రాగిణి , సంజన లు డ్రగ్స్ సేవించినట్టు ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ తేల్చేసింది . 2020 అక్టోబర్ లో ఇద్దరి వెంట్రుక నమూనాలను ఎఫ్ ఎస్ ఎల్ కు బెంగుళూరు పోలీసులు పంపారు . అయితే … ఈ ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ లో డ్రగ్స్ సేవించినట్టు తేలింది . మొదట బ్లడ్ , యూరిన్ నమూనాలను యాక్టర్ నుండి సేకరించి ల్యాబ్ కు పంపిన పోలీసులు … వాటిలో ఫలితం సరిగ్గా తేలకపోడంతో వెంట్రుకల నమూనాలను సేకరించారు.

ఇద్దరు కన్నడ హీరోయిన్లు రాగిణి , సంజన ల వెంట్రుకల నమూనాలను హైదరాబాద్ నగరం లోని ఎఫ్ ఎస్ ఎల్ కు పంపారు బెంగళూరు పోలీసులు . అయితే … వాటి లో డ్రగ్స్ సేవించినట్టు రిపోర్ట్ వచ్చింది . దీంతో ఆ ఇద్దరు కన్నడ హీరోయిన్లు చిక్కుల్లో పడ్డారు . దీంతో మరోసారి ఇద్దరికీ సమన్లు జారీ చేయనున్నారు బెంగుళూరు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement