Friday, May 3, 2024

వ్యవస్థను భ్రష్టుపట్టించి ఆర్తనాదాలేంటి రాజా?

మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయిందని పేర్కొన్నారు. ‘‘మాన్సాస్ వేలం పేరుతో జరిగిన భూమాయ బయటపడుతోంది. విజిలెన్స్ విచారణలో పూసపాటి అశోక్ ముసుగు తొలగిపోయింది. దేవాదాయశాఖ అనుమతి లేకుండా ప్రైవేట్ వెబ్ సైట్ క్రియేట్ చేసి వేలం వేశారంటేనే అసలు ఉద్దేశమేంటో అర్థమైపోతుంది. వ్యవస్థను భ్రష్టుపట్టించి ఇప్పుడు ఆర్తనాదాలు చేస్తే ఉపయోగం ఏంటి రాజా?’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement