Thursday, April 25, 2024

ఏపీలో ఉద్యోగులకు గమనిక.. రేపటి నుంచి బయోమెట్రిక్ తప్పనిసరి

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయం సహా హెచ్‌ఓడీ కార్యాలయాలు, కలెక్టర్‌ కార్యాలయాలు, రాష్ట్ర విభాగాలు తప్పనిసరిగా ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాలని ఆదేశించారు. ఆదేశాలు తక్షణం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లకు సూచించారు. కరోనా కారణంగా గతేడాది మే నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం బయోమెట్రిక్‌ హాజరును మినహాయించిన విషయం తెలిసిందే.

ఈ వార్తను కూడా చదవండి: జగన్‌పై హీరో అడివి శేష్ పొగడ్తలు

Advertisement

తాజా వార్తలు

Advertisement