Thursday, May 2, 2024

ఆచార్య సెట్ వెనుక పెద్ద కథే ఉంది !!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి 20 కోట్ల రూపాయల ఖర్చుతో 20 ఎకరాల లో ఒక భారీ సెట్ ను వేశారు. ధర్మస్థల పేరుతో ఒక ఆలయం దాని పరిసరాలకు సంబంధించిన సెట్ ఇది.

అయితే ఈ సెట్ కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది ఒక ఫైట్ కోసమో, లేక పాట కోసమో వేసిన సెట్ కాదట. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం 60 శాతం వరకు ఈ సెట్ లోనే జరుగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అలాగే చిరంజీవి చరణ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా ఈ సెట్ లోనే ఉంటాయట. ఇక తండ్రి కొడుకులు నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement