Wednesday, May 1, 2024

ఏపీలో 50% ఆక్యుపెన్సీ తో థియేటర్స్ – కరోనా ఎఫెక్ట్

కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే చాలా రాష్ట్రాలలోని థియేటర్లలో ఆక్యుపెన్సీ కుదించగా మరికొన్ని రాష్ట్రాలలో పూర్తిస్థాయిలో మూసివేశారు.

కాగా ఈ నేపథ్యంలోనే 50 శాతం ఆక్యుపెన్సీ ని అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కారణంగా సెకండ్ షో లు రద్దు కానున్నాయి. ఇదిలా ఉండగా కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలోనే పలు సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement