Wednesday, May 15, 2024

30 సెకన్ల గ్లింప్స్‌తో సరిపెడుతున్న మహేష్ ?

బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఓ గిఫ్ట్ ను ఫ్యాన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.

మొదట టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ ఇప్పటివరకు షూట్ చేసిన సీన్స్ లో టీజర్ కు సరిపడే…ఫుటేజ్ లేదట. దీంతో 30 సెకన్లకు గ్లింప్స్‌ని స్టార్ట్ చేసి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యారట. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ,14 రీల్స్ బ్యానర్ తో పాటు మహేష్ సొంత నిర్మాణ సంస్థ జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్ పై ఈ సినిమాను మహేష్ నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement