Monday, April 29, 2024

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు!! కొత్తగా 1,96,427 కేసులు

దేశంలో ఒక్కసారిగా భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,96,427 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. మ‌రోవైపు క‌రోనా మ‌ర‌ణాలు మాత్రం తగ్గలేదు. గడిచిన 24 గంటల్లో 3,511 మంది ఈ మ‌హ‌మ్మారి కారణంగా మృతి చెందారు. మరో వైపు 3,26,850 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

ఇక తాజా గణాంకాలతో దేశంలో కరోనా బారిన పడినవారి సంఖ్య 2.69 కోట్లుకు చేరింది. అలాగే అందులో 2.40 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 25.86 ల‌క్ష‌ల‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక క‌రోనా బారిన‌ప‌డి ఇప్పటి వరకు 3,07,231 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement