Friday, April 26, 2024

పుష్ప కి మళ్లీ బ్రేక్ ?

క్రేజీ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. మొత్తం 45 రోజులలో ఈ షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ మొదట ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు ఈ షూటింగ్ కు మళ్లీ బ్రేక్ పడినట్లు సమాచారం.

ఇటీవల హైదరాబాదులో కురిసిన వర్షాలకు ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్ మొత్తం చెడి పోయిందట. అందుకే ఈ సినిమాకి మళ్లీ గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement