Thursday, April 25, 2024

ఎన్టీఆర్ ని ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్.. సీఎం సీఎం అంటూ నినాదాలు

నేడు మాజీ సీఎం.. దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి. ఈ సంద‌ర్భంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ..హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తారక్‌ను చూడగానే అందరూ ముందుకొచ్చారు. భద్రత సిబ్బంది తారక్ చుట్టూ వలయంలా నిల్చున్నప్పటికీ వారిని కంట్రోల్ చేయలేకపోయారు. దాంతో, తారక్ ఇబ్బంది పడుతూనే ముందుకు నడిచారు. ఈ క్రమంలో పలువురు అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక, ఎన్టీఆర్ సమాధి వద్దకు చేరుకున్న తారక్‌కు కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతో ఇబ్బంది పడ్డారు. సమాధిపై వేసేందుకు తారక్‌కు పూల మాల ఇచ్చేందుకు ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. నేనిస్తానంటే నేనిస్తానంటూ పోటీ పడటంలో తారక్‌ కాస్త అసహనానికి గురయ్యారు. ఆ పూల మాలను తిరస్కరించి సమాధిపై పూలు చల్లి, నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.సీఎం సీఎం అని నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement