Friday, April 26, 2024

ఓటీటీ కే సై అంటున్న సూర్య ?

హీరో సూర్య కెరీర్ ఆరంభం నుంచి కూడా డిఫరెంట్ కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉన్నారు. గతేడాది వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. అదే జోష్ తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అందులో ఒకటి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై భీమ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాలో హీరో సూర్య గిరిజనుల హక్కులకు సంబంధించి పోరాడే ఒక న్యాయవాది గా కనిపించబోతున్నాడు. సూర్య కెరీర్ లో తొలిసారి న్యాయవాది గా నటిస్తున్నారు. ఇక ఇందులో రజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజు మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీ లో విడుదల కాబోతోందని ప్రచారం జరుగుతుంది. అయితే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా రాలేదు. కాగా ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement