Friday, May 17, 2024

దర్జాగా వస్తున్న సునీల్​, అనసూయ.. 22న రిలీజ్​ కానున్న మూవీ

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న సినిమా దర్జా. ఫిక్షన్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. సలీమ్‌ మాలిక్‌ దర్శకుడు. శివశంకర్‌ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దీనికి సంబంధించిన డేట్‌ అనౌన్స్‌మెంట్‌ లోగోని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్‌’ దర్శకుడు వీరశంకర్‌.. పాత్రికే యులు ప్రభు, వినాయకరావులు సంయుక్తంగా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement