Monday, May 6, 2024

‘ఆహా’లో ఎస్ఆర్ కళ్యాణమండపం

కరోనా మహమ్మారి కారణంగా చాలావరకు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొన్ని సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. కాగా ఆగస్టు 6న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఎస్ ఆర్ కళ్యాణమండపం రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం… ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దీనిని భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 27 నుంచి ఈ మూవీ ఆహా స్ట్రీమింగ్ చేసేందుకు సంస్థ ప్లాన్ చేస్తోందట.

అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది. శ్రీధర్ గాదే దర్శకత్వం… వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు హీరోనే రాయటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement