Friday, May 3, 2024

స్టార్ హీరోలు ప్రమోట్ చేస్తే సరిపోదు…!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సినీ అభిమానులు షాక్ ఇచ్చారనే చెప్పాలి. కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాటి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం చావు కబురు చల్లగా. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ పాల్గొని ప్రమోట్ చేశారు. మరోవైపు కీరవాణి కుమారుడు శ్రీ సింహ హీరోగా వారాహి చలన చిత్రం సంస్థ నిర్మించిన తెల్లవారితే గురువారం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమోట్ చేశారు. ఈ రెండు సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఫలితం రాబట్టలేకపోయాయి. నిజానికి ఈ స్టార్ హీరోల ప్రభావంతో సినిమాపై మంచి హైప్ వచ్చినప్పటికీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. దీంతో స్టార్ హీరోలు ప్రమోషన్ చేసినంత మాత్రాన సినిమాలు హిట్ అవ్వడం కష్టమని చాలా మంది క్లారిటీకి వచ్చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement