Sunday, April 28, 2024

సోను మరోసారి హీరో అయ్యాడు

లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి పేదల గుండెల్లో దేవుడయ్యాడు రియల్ హీరో సోను సూద్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో…. విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులను ప్రారంభించాయి. అయితే ఈ సమయంలో చాలా మంది గ్రామీణ విద్యార్థులు ఇంటర్నెట్ సౌకర్యం లేక పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్ గా నాగ పూర్ కు సమీపంలో గొడియా జిల్లాలో ఓ గ్రామనికి ప్రజలు ఇంటర్నెట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఏం చేయాలో తెలియక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా సోనూ కితెలిపాడు. దీనిపై స్పందించిన సోనూ సూద్… ఆ గ్రామంలో సెల్ టవర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడమే కాకుండా…అతి తక్కువ టైం లోనే మొబైల్ టవర్ ఏర్పాటు చేయించి వారి మనసులను గెలుచుకున్నాడు. టారువతగా వీడియో కాల్ ద్వారా ఆ గ్రామస్థులతో మాట్లాడారు. దీంతో మరోసారి నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement