Wednesday, May 15, 2024

‘చావు కబురు చల్లగా’ ఓటీటీలో వచ్చేస్తోంది

ఆర్ఎక్ప్ 100 ఫేం హీరో కార్తీకేయ నటించిన ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ త్వరలోనే ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బన్నీ వాసు నిర్మాత‌గా వ్యవహరించిన ఈ మూవీ ఈనెల 23 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో ‘బ‌స్తి బాల‌రాజు’ గా చేసిన హీరో కార్తికేయ నటనకు, అలాగే లావణ్య త్రిపాఠి, ఆమని పాత్రలకు చాలా మంచి స్పందన రావడమే కాకుండా.. వారి పర్ఫార్మెన్స్‌కు క్రిటిక్స్‌ కూడా మంచి మార్కులు వేశారు. ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఎక్కువవుతోన్న నేపథ్యంలో జనాలు మళ్లీ థియేటర్ల వైపు కాకుండా ఓటీటీల గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఓటీటీలు పలు కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇప్పటికే ‘జాతి రత్నాలు’ ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లోకి అందుబాటులోకి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement