Friday, May 17, 2024

బేబీ నుంచి రెండో లిరిక‌ల్ సాంగ్ రిలీజ్…

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ రిలికల్‌ సాంగ్‌ ను విడుదల చేశారు. ఈ పాటను మళయాల ఆర్య దయాళ్‌ చేత పాడించారు. ఈ గీతాన్ని వీడియోగానూ చిత్రీకరించారు. ఆ పాటలో ఆర్యదయాళ్‌ స్వయంగా నటించడం విశేషం.


విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరిన ఈ గీతాన్ని త్రిపురనేని కళ్యాణ్‌ చక్రవర్తి రాశారు. సంస్కృత పదాలతో మొదలైన పాట ఆసాంతం కట్టిపడేశాలా సాహిత్యం, కంపోజింగ్‌ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి నగరంలోని పెద్ద కాలేజ్‌ కు చదువుకోవడానికి వెళ్లిన ఓ అమ్మాయికి కనిపించే కొత్త ప్రపంచం అంతా నిజం కాదనీ.. నిజమనుకునే క్రీనీడలే అడుగడుగునా ఉంటాయనీ.. తెలుపదు కదా ఓ పాఠమై చదువే.. భ్రమల మైకాన భ్రమణమే చేసి భ్రమరమవుతుంది కాలమే.. అనే అద్భుతమైన సాహితీ విలువలున్న ఈ గీతం మాంటేజ్‌ సాగే పాటలా ఉంది.
హృదయ కాలేయం, కలర్‌ ఫోటో, కొబ్బరిమట్ట చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్‌ నిర్మించిన చిత్రం ఇది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement