Sunday, April 28, 2024

రష్మిక తర్వాతే ఎవరైనా !! 20 మిలియన్ల ఫాలోవర్స్

ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రష్మిక మందన్న. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే సోషల్ మీడియాలో అత్యంత యాక్టివ్ గా ఉండే రష్మిక మందన్న నిత్యం హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ…. అభిమానులను నెటిజెన్స్ ని ఆకట్టుకుంటుంది.

అతి తక్కువ సమయంలోనే 20 మిలియన్ ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అయితే సౌత్ లోనే చాలా మంది హీరోయిన్లకు సాధ్యం కాని ఈ ఘనతను ఈ అమ్మడు సాధించింది. అంత ఫాలోయింగ్ రావడానికి కారణం.. నిత్యం అభిమానులతో టచ్ లో ఉండటం… ఫోటోలను పోస్ట్ చేయడం ప్రధాన కారణం. అలాగే ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో చాలా సినిమాలున్నాయి. ఒక తెలుగులోనే కాకుండా తమిళం ,బాలీవుడ్ నాట కూడా సినిమాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement