Monday, April 29, 2024

అభిమానులు కష్టాల్లో ఉంటే స్టార్స్ ఎంజాయ్ చేస్తారా ? శృతిహాసన్

కరోనా మహమ్మారి వ్యాప్తి దేశంలో గణనీయంగా పెరుగుతోంది. ప్రతిరోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అలాగే వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇటువంటి సమయంలో కొంత మంది సెలబ్రిటీలు మాత్రం ఇవేవీ పట్టనట్లు అవుట్ డోర్ టూర్స్ కు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే విషయమై స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని… ఈ సమయం ఎంతో క్లిష్టమైనదని ఆమె చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో కొందరు విహారయాత్రలకు వెళ్లడం సరికాదని అన్నారు. స్టార్స్ ని అభిమానించే ఫ్యాన్స్ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీలు చేసుకోవడం, టూర్స్ కు వెళ్లి ఎంజాయ్ చేయడం మంచి పద్ధతి కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన వంతుగా ప్రజలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇటీవల రణబీర్, అలియా, జాన్వికపూర్, సారా అలీ ఖాన్, దిశాపటాని పలువురు స్టార్లు టూర్ లోకి వెళ్లి ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన ఫోటోలను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement