Wednesday, May 15, 2024

ఉత్పత్తికి కృష్ణ‌ప‌ట్నం థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం రెడీ…..

నెల్లూరు – రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌ రంగ సంస్థ.. ఏపీ జెన్‌కో ఉత్పత్తి సామర్థం మరింత పెరగనుంది. అతి త్వరలోనే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కృష్ణపట్నం)లో కొత్తగా 800 మెగావాట్లు- అందుబాటు-లోకి రానుంది. మే 20 నాటికి ఈ ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తి మొదలవుతుంది. విద్యుత్‌ ఉత్పత్తి మొదలవ్వగానే దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. జూన్‌ నెలాఖరు నాటికి వాణిజ్య ఉత్పత్తి (సీవోడీ)కి కూడా సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థం 5,010 మెగావాట్లు కాగా, కృష్ణపట్నం కొత్త యూనిట్‌ను కూడా కలుపుకుంటే ఇది 5,810 మెగావాట్లు- అవుతుంది. వాస్తవానికి ఇబ్రహీంపట్నంలోని మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ కూడా ఇదే సమయానికి అందుబాటు-లోకి రావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టు సంస్థ నిర్మాణ పనుల్లో ఆలస్యం చేయడం వల్ల అది ఇంకా అందుబాటులోకి రాలేదు.
రెండేళ్లుగా పుంజుకున్న వేగం
కృష్ణపట్నంలో మొదటి దశలో 800 మెగావాట్ల రెండు సూపర్‌ క్రిటికల్‌ (అత్యాధునిక -టె-క్నాలజీ) థర్మల్‌ యూనిట్లను నిర్మించారు. రెండో దశలో మరొక ప్లాంట్‌ను 2015లో ప్రారంభించారు. వాస్తవానికి ఇది 2018లోనే పూర్తవ్వాల్సి ఉంది. కానీ కొన్ని సాంకేతిక కారణాలతో అది ఆలస్యం అయింది. ఫలితంగా వ్యయం కూడా పెరిగింది. కొత్తగా ఏర్పడ్డ ఈ ప్లాంటు-కు మహానది కోల్‌ ఫీల్డ్‌ (ఎంసీఎల్‌) నుంచి ఏడాదికి 3.54 మిలియన్‌ టన్నుల బొగ్గు లింకేజీ కూడా ఉంది. రెండు ప్రాజెక్టులను ఒకే కాంట్రాక్టు సంస్థకు కాకుండా.. సివిల్‌ బాయిలర్‌, టరైన్బ్‌, జనరేటర్‌ (బీటీ-జీ)ని ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్‌ హెవీ ఎలక్ట్రిక్రల్స్‌ లిమి-టె-డ్‌ (బీహెచ్‌ఈఎల్‌)కు ఇచ్చారు. సివిల్‌ కాంట్రాక్టు పనులను టాటా సంస్థకు అప్పగించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెండు థర్మల్‌ ప్లాంట్ల పనులపై దృష్టి పెట్టింది. జాప్యం చేస్తే నిర్మాణ వ్యయం పెరిగి, విద్యుత్‌ ధర ఎక్కువయ్యే ప్రమాదం ఉండటంతో ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియలో వేగం పెంచింది. ఒక్కోదానికి రూ. వెయ్యి కోట్ల చొప్పున ప్రభుత్వమే గ్యారెంటీ-గా ఉండి అప్పు ఇప్పించేందుకు ముందుకొచిర్చది. దీంతో పలు ఆర్థిక సంస్థలు ముందుకొచ్చాయి. జెన్‌కో కొత్త ప్లాంట్‌ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తే బయట నుంచి విద్యుత్‌ను కొనాల్సిన అవసరం తప్పుతుంది. అలాగే డిమాండ్‌ (పీక్‌) -టైమ్‌లో కోతలకు ఆస్కారం లేకుండా విద్యుత్‌ను అందించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి నూటికి నూరు శాతం విద్యుత్‌ లభ్యతకు గ్యారెంటీ- ఉంటు-ంది. అత్యధిక పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌) వచ్చే అవకాశం ఉంది.
కృష్ణపట్నం 800 మెగావాట్ల థర్మల్‌ ప్లాంట్‌ను జూన్‌ చివరి నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్టీమ్‌లైన్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు ఫ్యూల్‌ గ్యాస్‌ డీ సల్ఫరైజేషన్‌ (ఎఫ్‌జీడీ) ప్లాంట్‌ కూడా ఏర్పాటు- చేస్తున్నారు. కింది భాగం నుంచే బూడిద విడుదలయ్యే కొత్త -టె-క్నాలజీని ఈ ప్లాంట్‌లో ఉపయోగిస్తున్నారు. ఈ ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభిస్తే రాష్ట్రాన్రికి రోజుకు మరో 35 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అదనంగా అందునుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement