Thursday, May 2, 2024

సలార్ సెట్ లో అర్ధరాత్రి వరకూ ఉన్న శృతిహాసన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అందులో రాధే శ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. మరోవైపు ఆదిపురుష్ , సలార్ షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ప్రశాంత్ నీల్… దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

అయితే తాజాగా కొత్త షెడ్యూల్ ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. సోమవారం హైదరాబాద్ లో ఈ షూటింగ్ ను ప్రారంభించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న ఈ షూట్ లో నిన్న అర్ధరాత్రి ఒంటిగంట వరకు పాల్గొన్నట్లు హీరోయిన్ శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఆగస్టు 8 నుంచి ప్రభాస్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ ను తెలంగాణలోని గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో జరిపిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement