Friday, April 19, 2024

తిరుమల లో శ్రీదేవి కూతురు పెళ్లి

అలనాటి తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే మొదటి చిత్రం ధడక్ తో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది. అంతే కాకుండా నటన పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వికపూర్… ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ అమ్మడు తన పెళ్లి ప్రస్తావనను తెరపైకి తీసుకు వచ్చింది.

పెళ్ళి తంతు అనేది రెండు మూడు రోజుల్లో ముగిసిపోవాలని…కాప్రి ఐల్యాండ్‌లో ఓ ప్రైవేట్‌ బోట్‌లో నా గ్యాంగ్‌తో కలిసి బ్యాచిలర్‌ పార్టీ చేసుకున్నాకా తిరుపతిలో చేసుకుంటానని చెప్పుకొచ్చింది. అలాగే మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న అమ్మ నివసించిన ఇంటిలో జరగాలని పెళ్లికి దక్షిణాది సంప్రదాయ చీర ధరించాలనేది నా కోరిక అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement