Sunday, May 26, 2024

కరోనా తో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి

కరోనా కారణంగా సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు కూడా మృతి చెందుతున్నారు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. తాజాగా ప్రముఖ సీనియర్ ఫోటోగ్రాఫర్ జయరాం కరోనా కారణంగా మృతి చెందారు. వరంగల్ లో జన్మించిన ఆయన యుక్త వయసులోనే సినిమాల పట్ల ఆసక్తి పెరిగి ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 13వ ఏట సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి ఇలా స్టార్ హీరోలకు చిత్రాలకు ఫోటోగ్రఫీ అందించారు. అందులో పెళ్లిసందడి, మేజర్ చంద్రకాంత్ లాంటి సూపర్ డూపర్ హిట్ కూడా ఉన్నాయి. కాగా గురువారం రాత్రి జయరాం మృతి చెందారు. దీనితో ఆయన మృతి పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement