Friday, April 26, 2024

సర్కారు వారి పాట మూవీ లేటెస్ట్ అప్డేట్ !!

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తారనుకున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. దీంతో షూటింగ్ ఆగిపోయింది.

అయితే తాజా సమాచారం ప్రకారం వచ్చే జూలై మొదటి వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారట. అయితే ఈ షెడ్యూల్ స్టార్ట్ చేశాక అది పూర్తయ్యే వరకు బ్రేక్ తీసుకోకుండా షూట్ జరపాలని చూస్తున్నారట. అలాగే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement