Sunday, April 28, 2024

చిరు రీమేక్ కి అదే హైలెట్ ?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు. అలాగే దీంతో పాటు వేదాళం రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా లో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటించనుంది. కాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఈ ఇద్దరి ట్రాక్ హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. 8 సంవత్సరాల తర్వాత మెహర్ రమేష్ తెలుగులో ఈ సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ పిలిచి మరీ ఈ అవకాశం ఇవ్వడంతో మెహర్ రమేష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడట. ఎలా అయినా సరే హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడట. పక్కా కమర్షియల్ అంశాలను కూడా ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి మెహర్ రమేష్ ఏమేర ఈ సినిమాతో హిట్ ని అందుకుంటాడో.

Advertisement

తాజా వార్తలు

Advertisement