Sunday, May 5, 2024

నీలి రంగు పట్టుచీరలో అదిరిపోయిన ఫిదా బ్యూటీ

ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సాయి పల్లవి. అయితే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది. అలాగే నాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాలో కూడా నటించింది. మరోవైపు రానా దగ్గుబాటి విరాటపర్వం సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ మూడు సినిమాలు ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఇంస్టాగ్రామ్ లో అప్పుడప్పుడు ఫోటోలు పెట్టే సాయి పల్లవి తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తన తాత అమ్మమ్మ సోదరి తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. తన తాత 85 వ పుట్టినరోజు సందర్భంగా నీలిరంగు పట్టు చీర కట్టుకొని నవ్వుతూ బ్యూటిఫుల్ గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement