Sunday, May 5, 2024

అప్పుడు ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ !!

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో థియేటర్లు మూత పడ్డ సంగతి తెలిసిందే. ఆ తర్వాత థియేటర్స్ తెరుచుకున్నాక డిసెంబర్ 25న సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మొదటి థియేటర్స్ లోకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్స్ ఉన్నాయి. అయితే ఆ సినిమా ఘన విజయం సాధించింది. కాగా ఈసారి కూడా థియేటర్లు తెరవగానే మొదట తన సినిమానే రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు సాయిధరమ్ తేజ్.

దేవకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందులో భాగంగానే సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ కూడా నిన్న మొదలు పెట్టాడు. నిజానికి ఈ సినిమా జూన్ 4న రావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. కానీ ఇప్పుడు థియేటర్స్ తెరవగానే విడుదల కావటానికి సిద్ధంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement