Wednesday, May 8, 2024

ద్విభాషా చిత్రంలో రష్మీక మందన్న

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు హీరోయిన్ రష్మిక మందన్న. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత వరుస అవకాశాలు ఈ అమ్మడికి వచ్చాయి. ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. కార్తీ హీరోగా వచ్చిన సుల్తాన్ సినిమాతో తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు రష్మిక.

అయితే ఇప్పుడు తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయబోతుంది రష్మిక. ఇది ద్విభాషా చిత్రమట. జాతిరత్నాలు… సినిమా డైరెక్టర్ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. నారాయణదాసు నారంగ్ పుస్కురు రామ్మోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement