Sunday, April 28, 2024

భీష్మ ను మించిన రంగ్ దే!!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇటీవల రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అంతకుముందు భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ని సాధించి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

అయితే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో రీసెంట్ గా ఈ సినిమా ప్రసారం అయింది. కాగా ఈ సినిమా ఏడు టిఆర్పి పాయింట్ల ను సంపాదించుకుంది. మరోవైపు గతంలో భీష్మ సినిమా జెమినీ టీవీలో ప్రసారం కాగా 6.65 టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంది. భీష్మ కంటే యావరేజ్ హిట్ అయిన రంగ్ దే సినిమా మంచి టీఆర్పీ రేటింగ్స్ సంపాదించడం విశేషం అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement