Friday, May 17, 2024

రకుల్ సోదరుడి సినిమా పాటని రిలీజ్ చేసిన రానా

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే ఆమె సోదరుడు అమన్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న చిత్రం త్రిశంకు. ఈ సినిమాలో ప్రాచీ తెహ్లాన్, రష్మి గౌతమ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీకృష్ణ గొర్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను లండన్ గణేష్, నల్ల అయ్యన్ననాయుడు నిర్మిస్తున్నారు.

కాగా తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఏడు రంగుల ఇంద్ర ధనుస్సులో అనే లిరికల్ వీడియో సాంగ్ ను ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను భాగ్యశ్రీ రాయగా సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. అలాగే రాహుల్ సిప్లిగంజ్ పాటని ఆలపించారు. కాగా నిర్మాతలు మాట్లాడుతూ… దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఈ సినిమాను నిర్మించామని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement