Friday, May 17, 2024

దిల్ రాజుతో శంకర్ ని కలిసిన రామ్ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు ఎక్కువవుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ ఓ ఫోటోని పోస్ట్ చేసి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ఆ ఫోటో మరేదో కాదు. రామ్ చరణ్, దర్శకుడు శంకర్, దిల్ రాజు ఈ ముగ్గురు కలిసి తీసుకున్న ఫోటో అది. ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ నిన్న చెన్నై లో అద్భుతమైన రోజు గడిపాను. ఇంత గొప్ప ఆతిథ్యం ఇచ్చిన శంకర్ సార్ ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. #RC15 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి అంటూ ట్వీట్ చేశారు రామ్ చరణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement