Saturday, May 4, 2024

రాధే శ్యామ్ ఓవర్సీస్ బిజినెస్ పై లేటెస్ట్ అప్డేట్ !!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కానీ ఆ తర్వాత కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయాలని నిర్ణయించుకున్నారు యూనిట్ సభ్యులు.

అయితే ఆ షూట్ ఇంకా కంప్లీట్ కాకముందే కరోనా ప్రారంభం అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవర్సీస్ లో ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కడి బిజినెస్ 3.5 మిలియన్ డాలర్స్ నుంచి 4 మేర జరగనున్నట్టుగా టాక్ . ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement