Sunday, April 28, 2024

బెల్లంకొండ కోసం విలేజ్ సెట్ ను రెడీ చేస్తున్న దర్శక నిర్మాతలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ సాధించిన చత్రపతి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ. ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతి లాల్ గడా ఈ ప్రాజెక్ట్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ భారీ విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ సెట్ ను వేసినప్పటికీ అది వర్షాలు కారణంగా దెబ్బతింది. ఇక మొదటి షెడ్యూల్ జూలై మొదటి వారం నుండి ఈ సెట్ లోనే జరగనుంది. ఇక హైదరాబాద్ ముంబై బంగ్లాదేశ్ లో ఈ షూటింగ్ జరగనుంది. కాగా ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ను కూడా ఫైనల్ చేయలేదు దర్శక, నిర్మాతలు. ఈ సినిమాతో పాటు బెల్లంకొండ ధనుష్ నటించిన కర్ణన్ రీమేక్లో కూడా నటించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement