Wednesday, May 1, 2024

రేపే టైగర్ నాగేశ్వ‌ర‌రావు ప్రీ-రిలీజ్ ఈవెంట్..

కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాల‌తో మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్నాడు. కాగా, ఇప్పుడు దసరా బరిలో నిలిచేందుకు మ‌రో సినిమాతో సిద్దంగా ఉన్న‌డు ర‌వితేజ. నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”.

ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రమోషనల్ కంటెంట్ బాగా ఆకట్టు కోవడంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుంది. ఇక‌, రిలీజ్ డేట్ దగ్గరప‌డుతుండ‌టంతో..ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఫిక్స్ అయ్యారు మేక‌ర్స్.

ఈ క్రమంలోనే రేపు (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ ‘శిల్పకళావేదిక’లో ప్రీ-రిలీజ్ ఈవెంటును నిర్వహించ‌నున్నారు మేక‌ర్స్. కాగా, ఈ ప్రీ-రిలీజ్ ఈవెంటుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఇక‌, ఈ వేడుకకు కిషన్ రెడ్డి, విజయేంద్రప్రసాద్, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, చందూ మొండేటి ముఖ్య అతిథులుగా హాజరు కానున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement