Friday, April 26, 2024

సలార్ ఇంటర్వెల్ సీన్స్ ప్లాన్ చేస్తున్న ప్రశాంత్

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చేయడానికి దర్శకుడు రెడీ అయ్యాడు.

కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సెట్ లోనే ఇంటర్వెల్ సీక్వెన్స్ లు, సోలో షాట్స్ షూటింగ్ చేయాలని ప్రశాంత్ భావిస్తున్నారట. ఏప్రిల్ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.అలాగే సలార్ లో వాణి కపూర్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement