Monday, April 29, 2024

టాప్ గేర్ లో ప్రభాస్…మరో పాన్ ఇండియా చిత్రం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. అంతేకాకుండా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

ఇక తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మరో సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ గూడచారి సంస్థ రా ఏజెంట్ గా ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పని జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement