Sunday, April 28, 2024

సలార్ ప్లాన్ చేంజ్ ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాధేశ్యామ్ సినిమా దాదాపుగా షూటింగ్ ను పూర్తి చేసుకోవచ్చసాగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు ప్రభాస్. అయితే ఆ తర్వాత సలార్ ఆ తర్వాత ఆది పురుష్ లను జూలై-సెప్టెంబర్ కి అలా షూటింగ్ లో పాల్గొని కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు.

కానీ తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు కి షిఫ్ట్ చేసినట్లు సమాచారం. కాగా దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement