Friday, March 29, 2024

పడవలో అపార్ట్మెంట్లు.. ధర రూ. 84 కోట్లు!

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప‌డ‌వ‌లో అమ్మ‌కానికి అపార్ట్‌మెంట్లు! ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప‌డ‌వ‌గా రూపుదిద్దుకుంటున్న సోమ్నియోలో అపార్ట్‌మెంట్ల‌ను అమ్మ‌కానికి పెట్టింది దాని నిర్మాణ సంస్థ‌. అత్యంత ల‌గ్జ‌రీగా రూపొందిస్తున్న వీటి ప్రారంభ ధ‌ర ఒక్కొక్క‌టి రూ. 84 కోట్లుగా నిర్ణ‌యించింది. 222 మీట‌ర్ల పొడ‌వైన ఈ ప‌డ‌వ‌లో మొత్తం 39 అపార్ట్‌మెంట్ల‌ను సిద్ధం చేస్తోంది. ఈ అపార్ట్‌మెంట్‌లో సెవెన్ స్టార్ హోట‌ల్ సౌక‌ర్యాల‌ను అందిస్తున్న‌ట్టు తెలిపింది. జిమ్, లైబ్ర‌రీ, కిచెన్ వంటి స‌దుపాయాలు ఉంటాయ‌ని చెబుతోంది. 2024లో ఇది అందుబాటులోకి రానుంది. ఎంత ధ‌న‌వంతులైన స‌రే ప్రైవేట్ ప‌డ‌వ‌ల‌ను సొంతం చేసుకోవ‌డం అంద‌రికి సాధ్యం అయ్యే ప‌నికాదు. కానీ సోమ్నియోతో అలాంటి ఔత్సాహికుల క‌ల నెర‌వేర‌నుంది. ప్ర‌పంచంలో అతిపెద్ద‌దైన ప‌డ‌వ‌గా ఇప్ప‌టిదాకా సౌదీ రాజుకు చెందిన అజ్జం ప‌డ‌వ‌కు పేరుంది. దాని కంటే సోమ్నియో 40 మీట‌ర్ల పొడ‌వు ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఇది ఎలా ఉంటుద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొని ఉంది. తాజాగా ఈ ప‌డ‌వ ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది నిర్మాణ సంస్థ రివీల్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement