Sunday, April 28, 2024

మళ్ళీ తెరపైకి ‘మా’ రచ్చ

మూవీ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈసారి పోటీలో మేమున్నామంటూ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నటి హేమ, జీవిత రాజశేఖర్ లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా… మరోసారి ఈ ఎన్నికల రగడ తెరపైకి వచ్చింది.

వెంటనే ఎలక్షన్స్ నిర్వహించాలని… 110 మంది సభ్యులతో సంతకాలు సేకరించి… క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజు వినతి పత్రం సమర్పించారు మా ఫౌండర్ మెంబర్ మాణిక్. అంతేకాకుండా మా ఇమేజ్ ను మసక బార్చే విధంగా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలక్షన్స్ లో మంచు విష్ణు కు మా ఫౌండర్ మెంబెర్ మాణిక్ కు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement