Friday, March 29, 2024

ప్రతి ఒక్కరికీ దళిత బంధుః సీఎస్ సోమేశ్

తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని తమకు ఇవ్వడం లేదంటూ కొందరు ఎస్సీలు ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ స్పందించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అందుతుందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. దళిత బంధు అద్భుతమైన పథకం అని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 16న హుజూరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కొందరు లబ్దిదారులకు స్వయంగా చెక్కులు అందిస్తారని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement