Thursday, May 2, 2024

ద‌నుశ్ సినిమాలో నిత్యామీన‌న్.. న‌టీన‌టుల టీమ్‌ని ప్ర‌క‌టించిన మేక‌ర్స్..

త‌మిళ ప్ర‌ముఖ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న కామెడీ-డ్రామా నేప‌థ్యంలో వ‌స్తున్న మూవీ ‘తిరుచిత్రంబలం’. మిత్రన్ ఆర్ జవహర్ ఈ మూవీకి డైరెక్ట్ చేస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిణంలో సినిమా రూపొందుతోంది. కాగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన న‌టీన‌టుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించింది సినిమా బృందం. నటి నిత్యా మీనన్, దర్శకుడు భారతీరాజా, నటుడు ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

సినిమాలో తిరుచిత్రంబలానికి ప్రాణ స్నేహితురాలు శోభన అనే పాత్రలో నిత్యమీన‌న్ నటిస్తుండ‌గా.. ప్రకాష్ రాజ్ నీలకందన్ అనే స్ట్రిక్ట్ ఇన్‌స్పెక్టర్‌గా ఉండ‌నున్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా సీనియర్ తిరుచిత్రంబళంగా నటిస్తున్నారని ప్రొడక్షన్ హౌస్ ప్రకటించింది. ఇంకా ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, రంజని అనే పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్నారని, ధనుష్ హైస్కూల్ స్నేహితురాలు అనూష పాత్రలో రాశి ఖన్నానటిస్తోందని నిర్మాతలు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement