Monday, April 29, 2024

స్పీడ్ పెంచిన నితిన్.. 30వ చిత్రం రెడీ

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ జోరు పెంచాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ‘చెక్’తో కాస్తంత డీలా పడ్డ నితిన్, మొన్నొచ్చిన ‘రంగ్ దే’తో తిరిగి ఉత్సాహం నింపుకున్నాడు. తాజాగా మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ని ప్రకటించారు. బాలీవుడ్ హిట్ చిత్రం అంధాధున్ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నితిన్ కు ఇది 30వ సినిమా. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో నభా నటేశ్, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అంధుడైన పియానో వాద్యకారుడిగా నితిన్ తన కెరీర్ లోనే విలక్షణ రోల్ పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మహతీసాగర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక, వెంకీ అట్లూరీ తెరకెక్కించిన రంగ్ దే మూవీ.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం కలెక్షన్స్ కూడా స్టడీగానే ఉన్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement