Monday, April 29, 2024

న‌య‌న్, విఘ్నేశ్‌ల‌కు ట్విన్స్‌.. సంతోషంలో మునిగితేలుతున్న అభిమానులు

ప్ర‌ముఖ న‌టి న‌య‌న‌తార‌, డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్‌లు త‌ల్లిదండ్రుల‌య్యారు. చాలాకాలంగా ల‌వ్‌లో ఉన్న వీరు పెళ్లి చేసుకుని ఏకం అయ్యారు. అయితే.. వీరికి పండంటి మ‌గ‌పిల్ల‌లు (ట్విన్స్‌) పుట్టిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకోవ‌డంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు.

ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసీ ద్వారా కవలలను జ‌న్మ‌నిచ్చ‌న‌ట్టు ప్రకటించారు. సోష‌ల్ మీడియాలో వార్తను పంచుకుంటూ, “నయన్ & నేను అమ్మ & అప్పగా మారాము… మేము ట్విన్ బేబీ బాయ్స్‌తో ఆశీర్వ‌దాలు అందుకుంటున్నాం.” అంటూ విఘ్నేష్ శివన్ రాశాడు.

విఘ్నేష్ వారి నవజాత శిశువుల చిన్న పాదాలను ముద్దాడిన రెండు అందమైన ఫొటోలను షేర్ చేశారు. వారి పేర్లు ఉయిర్ (జీవితం అని అర్ధం) ఉలగం (ప్రపంచం అని అర్ధం)గా పెట్టిన‌ట్టు తెలిపారు. కాగా, దీనిపై అభిమానులు విఘ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లోని ఇన్ బాక్స్‌ని కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement