Saturday, May 18, 2024

మాతృదేవోభవ రీమేక్ – ఈ సారి నయన్ కు అవకాశం

అజయ్ కుమార్ దర్శకత్వంలో కె.ఎస్.రామారావు నిర్మించిన ఎవర్ గ్రీన్ చిత్రం మాతృదేవోభవ. 1993 లో రిలీజ్ అయిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. కాగా ఈ సినిమాను కె.ఎస్.రామారావు అజయ్ కుమార్ తో మరోసారి ఈ సినిమాను రీమేక్ చేయాలని ఉందంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో మాధవి పోషించిన పాత్రకు నయనతార అయితే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక మలయాళ హిట్ మూవీ ఆకాషదూతు ను తెలుగులో మాతృదేవోభవ పేరుతో రీమేక్ చేశారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మరోసారి ఈ చిత్రాన్ని రీమేక్ చేద్దామని మేకర్స్ అనుకుంటున్నప్పటికి ప్రస్తుతం సినీప్రేక్షకులు కమర్షియల్, కామెడీ సినిమాలకు అలవాటు పడ్డారు. మరి ఈ సమయంలో ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement