Monday, April 29, 2024

నో హౌస్ ఫుల్… నో కలెక్షన్స్

సినిమా థియేటర్స్ కళకళలాడుతున్నాయి. వరుస సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత రిలీజ్ అయిన ఉప్పెన, జాతి రత్నాలు, బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించడంతో పాటు కలెక్షన్ లను కూడా రాబెట్టాయి. ఇక ఈ వారం శశి, చావు కబురు చల్లగా, మోసగాళ్లు సినిమాలు వచ్చాయి. ఇక ఈ మూడు సినిమాలలో చావు కబురు చల్లగా సినిమాకు కాస్త క్రేజ్ ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను ఆ స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఇక శశి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మోసగాళ్లు విషయానికి వస్తే సినిమాను మొదటి నుంచి జనాలు పట్టించుకోలేదు. దీంతో ఏ సినిమాకి కూడా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాలేదు. ఈ వారం రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ నిరాశ పరిచాయనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో నిర్మాతలకు కనీసం పెట్టిన డబ్బులు అయినా వస్తాయో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement